ad

Wednesday, March 4, 2015

పురపాలిక చెత్త వేయొద్దని వినతి

చిల్కమర్రి;గ్రామ సమీపంలో పురపాలికలో సేకరించిన చెత్త వేయరాదని మండలంలోని చిల్కమర్రి గ్రామస్థులు మంగళవారం కలెక్టరు టీకే శ్రీదేవికి విజప్తి చేశారు.సర్పంచి సుష్మా ఆధ్వర్యంలో పలువురు గ్రామస్థులు జిల్లా కేంద్రానికి వెళ్లికలెక్టరును కలిశారు.పురపాలిక పరిధిలో సేకరించే చెత్తను చిల్కమర్రి సమీపంలోని సర్వే నంబరు 123లో వేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిపారు.చెత్తవేసే ప్రదేశం గ్రామానికి అతి చేరువలో ఉన్నందున భరించలేనిదుర్వాసన వస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.అనంతరం కలెక్టరుకు వారు వినతిపత్రం ఆందిచారు.కె.రమేశ్,ఆనంద్,నర్సింహారెడ్డి,కె.కృష్ణయ్య,రాజేందర్ రెడ్డి,శ్రీధర్ గౌడ్,కేశవులు,పి.రవీందర్ రెడ్డి,పాల్గొన్నారు. 

No comments:

Post a Comment