ad

Sunday, August 23, 2015

అసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో మహిళ లాకప్ డెత్

హైదరాబాద్;అసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసులో నిందితురాలు అయిన పద్మ అనుమానాస్పదంగా మృతిచెందారు. భోజగుట్టకు చెందిన పద్మ అనే మహిళను ఓ చోరీ కేసుకు సంబంధించి పోలీసులు విచారిస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం ఆమె ఓ కేసులో నిందుతురాలని విచారణ నిమిత్తమే పిలిపించామని వారు తెలుపుతున్నారు. ఆమె మాట్లాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతిచెందిందని పోలీసులు తెలుపుతున్నారు.

No comments:

Post a Comment