ad

Sunday, August 23, 2015

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృతి

షాద్ నగర్:     పట్టణంలోని పటేల్ రోడ్డులో నివాసముంటున్న ఓ కుటుంబం ఘోర అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కుటుంబ సభ్యలు ప్రాణాలు కోల్పోయారు. ఉడిషావత్ గోపాల్ (లారీడ్రైవర్) అతని భార్య విజయ కొద్దికాలంగా పిల్లలతో పటేల్ రోడ్డులో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసముంటున్నారు. గోపాల్ లారీ పని నిమిత్తమై వెళ్లగా విజయ(38) తమ పిల్లలతో ఉంది. వీరందరు ఈ తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విజయ(38), చరణ్(06), చిట్టి(13) మృతి చెందగా భరత్,నిహారికలను చికిత్సనెమిత్తమై ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణాల గురించి ఆరా తీస్తున్నారు.

No comments:

Post a Comment