ad

Thursday, August 20, 2015

పెండింగ్ స్కాలర్ షిప్ లు చెల్లించండి

పెండింగ్ లో ఉన్న ఇంటర్మీడియట్ స్కాలర్ షిప్ లను ప్రభుత్వం వెంటనేచెల్లించాలని కోరుతూ బీసీ సంఘంవిద్యార్థులు ధర్నాకు దిగారు.ఈ మేరకు నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సంర్భంగా 2014-15 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం స్కాలర్ షిప్ లను ఇప్పటివరకు చెల్లించలేదని గుర్తు చేశారు.ప్రభుత్వం స్కాలర్ షిప్ లు చెల్లించకపోవడంతో,కళాశాలయాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి స్కాలర్ షిప్ లకు విడుదల చేసి సమస్యలను పరిష్కరించాలని బీసీ సంఘం విద్యార్థి నాయకులు కోరారు.

No comments:

Post a Comment