ad

Monday, August 24, 2015

స్కాలర్ షిప్ ల కోసం మంత్రి ఇళ్లు ముట్టడి

పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లను వెంటనే చెల్లించాలని కోరుతూ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించారు. సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలో ఉన్న మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నారు.కాగా,పోచారం ఇంటి ముట్టడికి వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.వెంటనే పెండింగ్ లో ఉన్న ఇంటర్ డిగ్రీ స్కాలర్ షిప్ లను చెల్లించాలని వారు ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడం తో విద్యార్దులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

No comments:

Post a Comment