ad

Thursday, September 3, 2015

సికింద్రాబాద్ లో ఆర్టీసీ బస్సు దగ్ధం,ప్రయాణికులు సురక్షితం

ప్రయాణికులతో జీడిమెట్ల నుంచి సికింద్రాబాద్ వస్తున్న జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు దగ్ధమైంది.ఇంజిన్ నుంచి పెగలు రావడాన్ని గమనించిన డ్త్రెవర్ అప్రమత్తమై సికింద్రాబాద్ పరేడ్ మైదానం సమీపంలో ప్రధాన రహదారిపై బస్సును నిలిపివేశాడు.వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు నుంచి కిందికి దిగారు.ప్రయాణికులు బస్సులోంచి కిందికి దిగిన కొద్ది క్షణాల్లోనే ఇంజిన్ నుంచి భారీగా మంటలు చెలరేగాయి.స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించటంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు.

No comments:

Post a Comment