ad

Thursday, September 3, 2015

ప్రభుత్వ ఆస్పత్రిలో 61 మంది చిన్నారులు మృతి

ఒడిశా రాష్ట్రం కటక్ లోని చిన్నపిల్లల ప్రభుత్వ ఆస్పత్రిలో మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.కేవలం రెండు వారాల్లో 61 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఇప్పటికే ఆ ఆస్పత్రిలో పనిచేసే ఐదుగురు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.మరో ముగ్గురు సిబ్బంది పై క్రిమినల్ కేసు పెట్టనున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాక  మంత్రి అతను ఎన్ నాయక్ చెప్పారు.వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదని,కేవలం సదుపాయాలు సరిగా లేకపోవడం వల్లనే చిన్నారులు మృతి చెందుతున్నారని  ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు ఆరోపించారు. ఇదిలా ఉండగా ఇంతమంది చిన్నారులు మృతి చెందుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆస్పత్రికి రాలేదని భాజపా ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శించారు.

No comments:

Post a Comment