ad

Tuesday, August 25, 2015

ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతదేహం కిమ్స్‌ నుంచి నారాయణఖేడ్‌కు తరలింపు

గుండెపోటుతో మృతిచెందిన మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి నుంచి నారాయణ్‌ఖేడ్‌కు తరలిస్తున్నారు. మంగళవారం ఉదయం ఆయన హైదరాబాద్‌లోని సంజీవరెడ్డి‌నగర్‌లో గల స్వగృహంలో గుండెపోటు రాగా కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా... అభిమానుల సందర్శనార్ధం మృతదేహన్ని ఆయన నియోజకవర్గ కేంద్రమైన నారాయణ‌ఖేడ్‌కు తరలిస్తున్నారు. రేపు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.

No comments:

Post a Comment