ad

Tuesday, August 25, 2015

నెల్లూరులో... ఐదు నెలల చిన్నారిని గొంతు నులిమి చంపిన తండ్రి

నెల్లూరు పట్టణంలో దారుణం వెలుగుజూసింది. ‘ఆడపిల్ల’ అనే కారణంతో ఓ కసాయి తండ్రి ఐదు నెలల చిన్నారిని గొంతు నులిమి హత్య చేశాడు. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు పట్టణంలోని గుర్రాలమడుగు సెంటర్ కు చెందిన అన్సర్ అనే వ్యక్తి ప్రత్యూష అనే యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. అయితే... వీరికి హర్షియా(5 నెలలు) అనే పాప ఉంది. కాగా... హర్షియా పుట్టిన నాటి నుంచే తనకు ఆడపిల్ల పుట్టిందని అసహ్యించుకుంటున్న అన్సర్ మంగళవారం పాపను గొంతు నులిమి హత్య చేశాడు. కాగా... అన్సర్‌కు నేర చరిత్ర కూడా ఉందని తెలుస్తోంది. గతంలో భార్య ప్రత్యూష కొత్త చీర కట్టుకున్నదని ఆమె జుట్టు కత్తిరించాడని, అంతేగాక కిరోసిన్ పోసి నిప్పంటించబోయాడని తెలిసింది. అలాగే ఇతనిపై పోలీస్‌‌‌స్టేషన్‌లో కూడా చోరీ కేసులు ఉన్నాయని తెలిసింది.

No comments:

Post a Comment