ad

Wednesday, August 19, 2015

జాతీయగీతం పాడితే బడి నుంచి తొలగిస్తాం...

జమ్మూకశ్మీర్‌లో జాతీయ గీతం పాడే స్వేచ్ఛకూడా లేకుండా పోయింది. దోడా జిల్లాలోని ఒక పాఠశాలలో జాతీయ గీతం పాడినందుకు విద్యార్థులపై ఉపాధ్యాయులు చేయిచేసుకున్నారు. ఇకపై వందేమాతరం, జణగణమణ పాడితే బడి నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.
 
హాద్వా ప్రాంతంలోని హైయర్ సెకండరీ స్కూల్‌లో ఈ సంఘటన జరిగింది. రెండేళ్లుగా పాఠశాలలో జాతీయ గీతం పాడే అవకాశం ఇవ్వడం లేదు. ఈ సారి ధైర్యం కూడగట్టుకుని ఆగస్టు 15 విద్యార్థులంతా జాతీయగీతం ఆలపించారు. వారిని మధ్యలోనే అడ్డుకున్న కొందరు ఉపాధ్యాయులు దౌర్జన్యం కూడా చేశారు.

No comments:

Post a Comment