ad

Wednesday, September 2, 2015

కార్మికులకు సామాజిక భద్రత: అచ్చెన్నాయుడు

ఒప్పంద కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తగు చర్యలు చేపట్టిందని కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయు డు తెలిపారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్‌రావు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఒప్పంద కార్మికులే కాకుం డా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పరిశ్రమలో పనిచేసే కార్మికుల సంక్షే మం కోసం ఆయా పరిశ్రమలకు వర్తింపచేసేలా చట్టాలు రూపొందించినట్లు మంత్రి చెప్పారు. ఈ ఏడాది మే-డే నుంచి అసంఘటిత కార్మికులకు ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించామని మంత్రి స్పష్టం చేశారు.

No comments:

Post a Comment